జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తొలి చిత్రాన్ని ఆవిష్కరించిన జో బైడెన్

 జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తొలి చిత్రాన్ని ఆవిష్కరించిన జో బైడెన్

వాషింగ్టన్: విశ్వం పుట్టుక గురించి తెలుసుకోవడానికి మానవుడు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ను స్పేస్ లో పెట్టింది.  ఇప్పుడా టెలిస్కోప్ తన మొట్టమొదటి చిత్రాన్ని నాసాకు పంపింది. వేల కొలది గెలాక్సీలు... బ్లూ, ఆరెంజ్, వైట్ వర్ణాల్లో ఎన్నో విషయాలు ఈ ఫోటోలో కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంలో జో బైడెన్ మాట్లాడుతూ... ఈ రోజు చారిత్రాత్మకమైనదన్నారు. మానవాళికి చరిత్రలో ఈ రోజు మరువలేనిదన్నారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మాట్లాడుతూ... మానవ చరిత్రలో ఈ క్షణం మరువలేనిదన్నారు. విశ్వ చరిత్రలో ఈ రోజు ఓ గొప్ప అధ్యాయమని కొనియాడారు. ఇకపోతే...  జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఇతర ఫోటోలను నాసా, యూరోపియన్ యూనియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా ఇవాళ విడుద చేయనున్నాయి.